UPSC Civil Services Final Result 2022: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. టాపర్గా ఇషితా కిషోర్..
దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి యూపీఎస్సీ(UPSC) ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో IAS(ఐఏఎస్) సర్వీసెస్కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే ఐఎఫ్ఎస్(IFS)కు 38 మందిని, ఐపీఎస్(IPS)కు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022కి చేరింది.
IAS Vijay Wardhan Success Story: జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు... వరుసగా 35 సార్లు ఫెయిల్... చివరికి ఐఏఎస్ సాధించానిలా
జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, OBC కేటగిరీ కింద 263 మందిని, SC కేటగిరీ కింద 154 మందిని, ST వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఈ ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్గా, గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానంలో నిలిచారు.
Civils 2022 Toppers From Telugu States
- Uma Harathi: AIR-3
- GVS Pavan Datta: AIR - 22
- Sri Sai Ashrith Shakhamuri: AIR -40
- Mahesh Kumar Kamtam: AIR - 200
- Ravula Jayasimha Reddy: AIR 217
- P. Sravan Kumar: AIR -222
- Challa Kalyani: AIR - 285
- Eppalapally Sushmitha: AIR-384
- Dongre Revaiah: AIR- 410
- Pathipaka Sai Kiran: AIR - 460
- Ruthvik Sai Kotte: AIR - 558
- Yerramsetty USL Ramani: AIR 583
- Taliya Hemanth: AIR 593
- Tummala Sai Krishna Reddy: AIR 640
- G. Akshay Deepak: AIR 759
- Kallam Srikanth Reddy: AIR 801
- Donepudi Vijay Babu: AIR - 827
- Koyyada Pranay Kumar: AIR 885
కాగా యూపీఎస్సీ సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది జూన్ 5న నిర్వహించబడింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూన్ 22న విడుదలయ్యాయి. ప్రధాన పరీక్ష సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు నిర్వహించబడింది. ఫలితాలు డిసెంబర్ 6న ప్రకటించబడ్డాయి. ఇంటర్వ్యూలు మే 18న ముగిశాయి.
IAS Success Story: ఈ రెండు అలవాట్లే.. నేను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్.. కానీ..