Haripriya: ప్రత్యేక శిక్షణకు విద్యార్థిని ఎంపిక

కాగజ్‌నగర్‌టౌన్‌: హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ శిబిరానికి కాగజ్‌నగర్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న హరిప్రియ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ చక్రపాణి తెలిపారు.
హరిప్రియ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 18 మంది విద్యార్థులను ఎంపిక చేయగా అందులో హరిప్రియ ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబ‌ర్ 23 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని వలంటీ కళాశాలలో సైబర్‌ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు .. శాస్త్ర సాంకేతికత వినియోగంపై ఇవ్వనున్న ప్రత్యేక శిక్షణలో సదరు విద్యార్థి పాల్గొననున్నట్లు తెలిపారు.

చదవండి:

ఐఐఐటీహెచ్‌లో రూ.110 కోట్లతో ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్’

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఎక్కడివారికి అక్కడే తరగతులు

#Tags