Skip to main content

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఎక్కడివారికి అక్కడే తరగతులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఎక్కడి వారక్కడే విద్యాభ్యాసం చేసేలా క్యాంపస్‌లను సిద్ధం చేయాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు.
బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలని, నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని మంత్రి చెప్పారు. ఇడుపులపాయలో ఉన్న ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల కోసం ఒంగోలులోనే అన్ని వసతులు ఉన్న భవనాలను సిద్ధం చేయాలన్నారు. ట్రిపుల్‌ ఐటీలలో అధ్యాపకులను నియమించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Published date : 25 Mar 2021 04:21PM

Photo Stories