పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి
కాళోజీ సెంటర్: ప్రాథమిక పాఠశాలలకు పదివేల హెచ్ఎం పోస్టులు మంజూరు చేసి పదోన్నతుల కల్పించాలని, స్కూల్ గ్రేడ్ టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి బోగేశ్వర్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కా ర్యక్రమం వరంగల్, ఖిలా వరంగల్ మండలంలోని పాఠశాలల్లో ఆగస్టు 13న నిర్వహించి, మాట్లాడారు. డీఈడీతోపాటు బీఈడీ అర్హత కలిగిన టీచర్లకు పదోన్నతులు కల్పించాలని, పాత పెన్షన్ విధానా న్ని పునరుద్ధరించాలన్నారు.
చదవండి: School Education Department: గుట్టుగా టీచర్ల సర్దుబాటు!
పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి మనోజ్, ఉపాధ్యక్షుడు స్వామి, అశోక్, వెంకటేశ్వర్లు, రమేశ్, ఉమేశ్, హరిప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.
#Tags