School Admissions: 5 నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని డోర్నకల్‌, తొర్రూరు మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్‌ జూలై 9న‌ తెలిపారు.

జిల్లాలోని ఆ రెండు పాఠశాలల్లో మొత్తం 32 సీట్లు ఖాళీగా ఉన్నయని, ఆసక్తి గల విద్యార్థులు జూలై 15వ తేదీ వరకు దరఖాస్తులు సంబంధిత పాఠశాలలో నేరుగా సమర్పించాలన్నారు.

జూలై 18న డ్రాపద్ధతిన ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు డోర్నకల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫోన్‌ 79950 57927, తొర్రూరు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫోన్‌ 79950 57928 నంబర్లలో సంప్రదించాలన్నారు.
చదవండి:

Group 1 Results: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో తండ్రీకొడుకుల ఉత్తీర్ణత

Renewal of Faculty : డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కాంట్రాక్టు పునరుద్ధరించడానికి దరఖాస్తులు.. అర్హ‌త వీరికే!

#Tags