టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు మరో అవకాశం
నారాయణపేట : సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా టెన్త్, ఇంటర్ చదువుకునే అభ్యర్థులు ఫీజు చెల్లింపునకు మరో అవకాశం కల్పించినట్లు డీఈఓ ఎండీ అబ్దుల్ఘని ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి వారికి రూ.500, ఇంటర్ వారికి రూ.వెయ్యి అపరాద రుసుం మీసేవా కేంద్రంలో చెల్లించాలని తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని, ప్రతిరోజు రెండు పూటలా పరీక్షలు ఉంటాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.
#Tags