TET Exam: ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

నిర్మల్‌ రూరల్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏప్రిల్ 16న‌ మాట్లాడారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్‌ పేపర్స్ | TS TET ప్రివియస్‌ పేపర్స్

ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయులను, దివ్యాంగులను, గర్భిణులను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్‌, వహీద్‌ఖాన్‌, గౌరవ అధ్యక్షుడు ఎం.పరమేశ్వర్‌రెడ్డి, కోశాధికారి పోల ధర్మరాజ్‌ పాల్గొన్నారు.

#Tags