AP Jobs: దేవదాయ శాఖలో 70 పోస్టులకు నోటిఫికేషన్ జారీ .. కేటగిరీల వారీగా పోస్టులు వివరాలు ఇలా..
35 ఏఈఈ (సివిల్), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్), మరో 30 టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) పోస్టులు కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నియామక ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం ప్రముఖ సంస్థ ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా’కు అప్పగించింది. ఏఈఈ పోస్టులకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వారు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్ అంశాలపైన, పది మార్కులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం, మరో పది మార్కులకు జనరల్ నాలెడ్జితో కూడిన మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవదాయ శాఖ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది.
చదవండి: Andhra Pradesh Govt Jobs 2023: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
దేవదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల పునర్నిర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపడుతోంది.
రూ. 450 కోట్లకు పైగా పనులకు అనుమతులు తెలిపింది. అందులో రూ. 250 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరోపక్క టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో రూ. 300 కోట్ల ఖర్చుతో 3 వేల ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మరో రూ. 50 కోట్ల టీటీడీ ఆర్థిక సహాయంతో రాష్ట్రమంతటా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం సాగుతోంది.
చదవండి: Andhra Pradesh Govt Jobs 2023: ఏపీఎస్సీఎస్సీఎల్ లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మరోవైపు దేవదాయ శాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటికీ వచ్చే 35 ఏళ్ల దాకా పెరిగే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయాల వారీగా కొత్త మాస్టర్ ప్లాన్లను రూపొందించింది. వాటికి అనుగుణంగా ఆ ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అత్యవసరంగా కాంట్రాక్టు విధానంలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టు దేవదాయ శాఖ పేర్కొంది.
పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బందిని నియమిస్తున్నాం. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’కు అప్పగించాం.
– కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ)
దేవదాయ శాఖ భర్తీ చేసే పోస్టులు కేటగిరీల వారీగా..
ఏఈఈ (సివిల్) – 35 |
|
కేటగిరీ |
పోస్టుల సంఖ్య |
ఓసీ |
15 |
బీసీ |
09 |
ఎస్సీ |
05 |
ఎస్టీ |
03 |
ఈడబ్ల్యూఎస్ |
03 |
ఏఈఈ (ఎలక్ట్రికల్) – 05 |
|
ఓసీ |
03 |
బీసీ (ఏ) |
01 |
ఎస్సీ |
01 |
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్ ) 30 |
|
ఓసీ |
13 |
బీసీ |
08 |
ఎస్సీ |
05 |
ఎస్టీ |
02 |
ఈడబ్ల్యూఎస్ |
02 |