PAT: డీఈఓ తెలిపిన అడ్వాన్స్‌మెంట్ ఫీజు

ప్రోఫెష‌న‌ల్ అడ్వాన్స్‌మెంట్ ప‌రీక్ష‌ల మెర‌కు హాజ‌రు కానున్నవారు చెల్లించాల్సిన ఫీజు గురించి బుధ‌వారం డీఈఓ వివ‌ర‌ణ ఇచ్చారు...
PAT Exam fees for AP teachers

సాక్షి ఎడ్యుకేష‌న్‌: సెప్టెంబర్‌లో నిర్వహించనున్న ప్రొఫెషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌ టెస్టుకు హాజరుకాదలచుకున్న జిల్లాలోని వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ నెల 31వ తేదీలోగా రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.60 అపరాధ రుసుంతో సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సెప్టెంబర్‌ 9వ తేదీలోగా సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

#Tags