Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలు.. ఈ విద్యార్థులు అర్హులు
అనంతపురం: లేపాక్షి నవోదయ స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతుండాలని వెల్లడించారు.
JAM 2025 Notification: జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ పరీక్ష పూర్తి వివరాలు ఇవే..
జిల్లాలో నివసిస్తున్న వారై ఉండాలని, 2013 మే 1 నుంచి 2015 జూలై 31లోపు పుట్టిన పిల్లలు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబరు 16లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.navodaya.gov.in వెబ్సైట్ను పరిశీలించాలని పేర్కొన్నారు.
#Tags