Skip to main content

Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్‌..

Navodaya Vidyalaya Admissions

చిత్తూరు కలెక్టరేట్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతి అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దేవరాజు తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరంలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024–25వ విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01–05–2013 నుంచి 31–07–2015 మధ్య జన్మించిన వారై ఉండాలని తెలిపారు.

JNTUA B. Tech Results : జేఎన్‌టీయూఏ బీటెక్ రెండో సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..

సెప్టెంబర్‌ 16వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎంపిక పరీక్ష తేదీ జనవరి 18న నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.navodaya.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కోరారు.

Published date : 27 Jul 2024 03:41PM

Photo Stories