TSPSC Group 4 Results Out : బ్రేకింగ్ న్యూస్.. టీఎస్పీఎస్సీ గ్రూప్-4 ఫలితాలు విడుదల.. రిజల్డ్స్ కోసం క్లిక్ చేయండి (Click Here)
సాక్షి ఎడ్యుకేషన్ : దాదాపు 7,62,872 మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-4 తుది ఫలితాలు ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేశారు.
గ్రూప్-4 అభ్యర్థుల ర్యాంకుల లిస్టును టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రకటించింది. టీఎస్పీఎస్సీ అధికార వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది.గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కిందటి ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీ ఫైనల్ కీ కూడా విడుదల చేసింది.
☛ టీఎస్పీఎస్సీ గ్రూప్-4 రిజల్డ్స్ కోసం క్లిక్ చేయండి (Click Here)
#Tags