Group 1 Results: గ్రూప్–1 ప్రిలిమ్స్లో తండ్రీకొడుకుల ఉత్తీర్ణత
కామేపల్లి: గ్రూప్ –1 ప్రిలిమినరీ పరీక్షలో తండ్రీకొడుకులు ఉత్తీర్ణత సాధించి మెయిన్స్కు అర్హత సాధించారు.
ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవికిరణ్ కామేపల్లి మండలం ఎంజే పల్లి హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లిష్)గా పని చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు మైఖేల్ ఇమ్మానియేల్ కూడా గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కు ఒకేసారి అర్హత సాధించారు.
గ్రూప్–1 పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడికి సహకారం అందిస్తూ, సలహాలు, సందేహాలు తీరుస్తూ తండ్రి కూడా ప్రిలిమ్స్ రాశారు. రిజర్వేషన్ కోటాలో ఐదేళ్లు, ఇన్ సర్వీస్ కోటాలో ఐదేళ్లు మినహాయింపు ఉండడంతో 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్–1 మెయిన్స్కు అర్హత సాధించడం విశేషం.
#Tags