SHRESHTA 2024 Admissions: విద్యార్థులకు ఉచితంగా ‘శ్రేష్ట’మైన విద్య.. దరఖాస్తు చేసుకోండి..

అనంతపురం సిటీ: విద్యార్థుల ఉజ్జ్వల భవిత కోసం ప్రవేశపెట్టిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. 'నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ట–నెట్స్‌ 2024' పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరణ నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.

ఈ పథకానికి ఎస్సీ బాల బాలికలు నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు జెడ్పీ సాంఘిక సంక్షేమ శాఖల స్థాయీ సంఘాల చైర్‌పర్సన్‌ నాగ రత్నమ్మ ఏప్రిల్ 1వ తేదీ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 12 నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి. వీటిని https://exams.nta.ac.in/SHRESHTA వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని మే 24న జరిగే రాత పరీక్షకు హాజరు కావచ్చు.

National Testing Agency: నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ట-నెట్స్‌ 2024

#Tags