Admissions: గురుకుల ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

నర్సాపూర్‌: గిరిజన విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ జూనియర్‌ కాలేజీలలో ప్రవేశం కోసం ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని గిరిజన గురుకులాల మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ సంపత్‌కుమార్‌ ఫిబ్ర‌వ‌రి 15న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల వరకే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. కాగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌కార్డు, నీలం లేదా నలుపు రంగు పెన్నులు, ఎగ్జామ్‌ ప్యాడ్‌ వెంట తెచ్చుకోవాలన్నారు.

చదవండి: Maccha Vinodkumar: పీజీటీలో 12వ ర్యాంక్‌ సాధించిన‌ మచ్చ వినోద్‌కుమార్‌

తన పరిధిలో నర్సాపూర్‌లోని గురుకుల కాలేజీలో 343 మంది విద్యార్థులను పరీక్ష రాసేందుకు కేటాయించామని, కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గురుకుల డిగ్రీ కాలేజీలో 330 మందిని, నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయ్‌ (తిర్మన్‌పల్లి) గురుకుల పాఠశాలలో 258 మంది విద్యార్థులను కేటాయించామని తెలిపారు.

#Tags