Sakshi Mock EAPCET & NEET Exams 2024 : ఏప్రిల్‌ 27,28 తేదీల్లో సాక్షి మీడియా ఆధ్యర్యంలో ఈఏపీసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌ . అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.

అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్‌  కల్పించే ఎంసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్, నీట్‌ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది. ఈ పరీక్షలను సాక్షి మీడియా,  ICFAI యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తుంది.

రియల్‌ టైమ్‌..
పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌  స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. 

పరీక్షలు ఎప్పుడంటే..?

రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నెంబర్‌కు హాల్‌ టికెట్‌ నంబర్‌ వస్తుంది. ఏప్రిల్‌ 27వ తేదీన నీట్, ఏప్రిల్‌ 28న ఈఏపీసెట్‌ అగ్రికల్చర్,ఇంజనీరింగ్‌ పరీక్షలుంటాయి. ఈ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా పరీక్ష రాసుకోవచ్చు. పరీక్ష సమయం 3:00 గంటలు. ఈ పరీక్షలను మీ హాల్‌ టికెట్‌ నంబర్‌ (యూజర్‌ నేమ్‌), ఫోన్‌ నెంబర్‌ (పాస్‌వర్డ్‌)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్‌ అయ్యి రాసుకోవచ్చు. అలాగే పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను కూడా చూసుకోవచ్చు. మాక్‌ పరీక్షలను  https://sakshimocktest.myrank.co.in వెబ్‌సైట్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు టెక్నాలజీ పాట్నర్‌గా మై ర్యాంక్‌ వ్యవహారిస్తున్నది.  టెస్ట్‌కి సంబంధించిన 'కీ' ని ఏప్రిల్‌ 30న ఇదే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు: 95055 14424, 96660 13544, 96665 72244. 

#Tags