Sampoornata Abhiyan: ‘సంపూర్ణత అభియాన్’ను ప్రారంభించిని నీతి ఆయోగ్

భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నీతి ఆయోగ్ జూలై 4వ తేదీ ‘సంపూర్ణతా అభియాన్’ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ 3 నెలల పాటు జరిగే ప్రచారం 112 ఆకాంక్షాత్మక జిల్లాలు, 500 ఆకాంక్షాత్మక బ్లాక్‌లలో ముఖ్యమైన సూచికలలో గణనీయమైన పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం భారతదేశం యొక్క సమగ్రాభివృద్ధి దిశగా ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.

'సంపూర్ణతా అభియాన్' చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా 'సంపూర్ణత ఉద్యమం'గా మారాలని దృష్టి పెడుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ఆరోగ్యం, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుధ్యం వంటి ఆరు ముఖ్య సూచికలపై దృష్టి పెడుతుంది. ఈ ప్రచారం ద్వారా, భారతదేశం యొక్క పురోగతిలో ఎవరూ వెనుకబడకుండా చూసుకోవడమే లక్ష్యం.

2015 జనవరి ఒక‌ట‌వ తేదీ నీతి ఆయోగ్‌ను స్థాపించారు. ప్ర‌స్తుతం నీతి ఆయోగ్ ఛైర్పర్సన్‌గా నరేంద్ర మోదీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సుమన్ బేరీ ఉన్నారు.

New Indian Criminal Laws: అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ఇవే..

#Tags