Kerala Assembly: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం

కేరళ అసెంబ్లీ 2024 వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బిల్లు ఉపసంహరించుకోవాలని కోరుతూ కేరళ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ మంత్రి వీ అబ్దురహిమాన్ ఈ బిల్లును రాష్ట్ర హక్కులు, లౌకిక సూత్రాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు.

ప్రతిపక్ష యూడీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలో సవరణలను సూచించినప్పటికీ, తీర్మానానికి మద్దతు ఇచ్చింది. అబ్దురహిమాన్ మాట్లాడుతూ, ఈ బిల్ రాష్ట్ర హక్కులను ఉల్లంఘిస్తుందని, వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డులు మరియు ట్రిబ్యునల్‌ల అధికారాన్ని బలహీనపరుస్తుందని తెలిపారు.

అతను ఈ బిల్లును రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలను ఉల్లంఘించేలా రూపొందించబడిందని, ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగించడానికి నామినేటెడ్ సభ్యులు మరియు ఛైర్మన్‌ను నియమించడమే కాకుండా, రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.

HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. 14వ మహారత్న కంపెనీ

1954లో మొదటిసారిగా వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ చట్టాన్ని పలుమార్లు సవరించబడింది. 1995లో మొదటి సారిగా సవరణ జరిగినప్పుడు, ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది, 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం కూడా సవరణలు చేసింది. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags