WTO Ministerial Meeting: అబూ ధాబీలో జరిగిన డబ్ల్యూటీవో మంత్రివర్గ సమావేశం

అబూ ధాబీలో ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 2వ తేదీ వరకు మరో డబ్ల్యూటీవో (వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) 13వ మంత్రివర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశం ఫలితాల విశ్లేషణ ఇదే..
 

  • మత్స్య రాయితీలపై బహుపాక్షిక ఒప్పందం, పబ్లిక్‌ స్టాక్‌హోల్డింగ్‌ సమస్య, అప్పీలేట్‌ బాడీ పునరుద్ధరణ వంటి కీలక అంశాలలో పురోగతి సాధించలేకపోయింది.
  • ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్మిషన్‌లపై కస్టమ్స్‌ డ్యూటీ మారటోరియం రెండేళ్లపాటు పొడిగించబడింది.
  • చైనా నేతృత్వంలోని పెట్టుబడి సులభతర అభివృద్ధి ఒప్పందం భారత్, దక్షిణాఫ్రికా వ్యతిరేకతతో ముగిసింది.
  • డబ్ల్యూటీవో భవిష్యత్తు అస్పష్టంగా ఉంది, భారత్ తన వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టాలి.
     
  • మత్స్య రాయితీలు: భారత్ సమానత్వం కోసం పోరాడింది, అయితే యూరోపియన్‌ యూనియన్, జపాన్, చైనా, తైవాన్ లాంటి దేశాలు భారీ సబ్సిడీలు ఇవ్వడం కొనసాగించాయి. భారత్ 25 ఏళ్ల సమయాన్ని కోరింది, కానీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
  • పబ్లిక్‌ స్టాక్‌హోల్డింగ్‌: పేదరికాన్ని నిర్మూలించడానికి భారత్‌కు ఈ పద్ధతి అవసరం, కానీ అభివృద్ధి చెందిన దేశాలు దీన్ని మార్కెట్‌ యాక్సెస్‌తో లింక్‌ చేయాలని పట్టుబట్టాయి. ఈ సమస్యపై పురోగతి లేదు.

Coastal US Cities: ముంపు అంచున అగ్రరాజ్యం.. 24 తీర నగరాలు మునిగిపోయే ప్రమాదం!!

  • అప్పీలేట్‌ బాడీ: అమెరికా అభ్యంతరం కారణంగా పునరుద్ధరణ కాలేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే, డబ్ల్యూటీవో నుండి అమెరికా నిష్క్రమించే అవకాశం ఉంది.
  • ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్మిషన్‌ డ్యూటీ: భారత్ యుఏఈ వాణిజ్య మంత్రి అభ్యర్థన మేరకు రెండేళ్లపాటు మారటోరియం పొడిగింపుకు అంగీకరించింది.
  • చైనా ఒప్పందం: చైనా నేతృత్వంలోని పెట్టుబడి సులభతర అభివృద్ధి ఒప్పందం భారత్, దక్షిణాఫ్రికా వ్యతిరేకతతో ముగిసింది. ఇది భారత్-చైనా సన్నిహితతకు ముగింపు పలుకుతుంది.

కాగా.. డబ్ల్యూటీవో భవిష్యత్తు అస్పష్టంగా ఉంది. దీంతో యూరోపియన్‌ యూనియన్, బ్రిటన్, గల్ఫ్‌ సహకార మండలితో, భారత్ తన వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టాలి. 

Indian Population Other Than India: విదేశాల్లో ‘మినీ ఇండియా’.. ఆ దేశాలు ఇవే!!

#Tags