Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్ భారత్‌లో భాగమే..

అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌కు చెందిన ప్రాంతమేనని అమెరికా స్పష్టం చేసింది.

వాస్తవాదీన రేఖ(ఎల్‌ఏసీ) ఆవలి వైపు చైనా చేసే ఏకపక్ష చొరబాట్లను అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్‌ పర్యటన నేపథ్యంలో చైనా ఆర్మీ ఈ ప్రాంతంపై తన హక్కును చెప్పుకోవడంపై అమెరికా స్పందించింది. చైనా ఈ ప్రాంతాన్ని ‘జాంగ్నాన్‌’గా పిలవడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అరుణాచల్‌ భారత్‌లో విడదీయరాని భాగమని భారత్‌ స్పష్టం చేసింది.

వివరాలు:

  • అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్‌ ఉప అధికారప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌కు చెందిన ప్రాంతమేనని స్పష్టం చేశారు.
  • చైనా సైన్యం, పౌరులు ఎల్‌ఏసీ ఆవలి వైపు నుండి ఏకపక్షంగా చొరబాట్లకు పాల్పడే ప్రయత్నాలను అమెరికా వ్యతిరేకిస్తోంది.
  • ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించిన నేపథ్యంలో చైనా ఆర్మీ మరోసారి ఈ భూభాగం తమదేనంటూ ప్రకటించడంపై అమెరికా స్పందించింది.
  • భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌లోని ‘జాంగ్నాన్‌’గా చైనా పేర్కొంటోంది. దీనిని భారత్‌ తీవ్రంగా ఖండించింది.
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎల్లప్పుడూ భారత్‌లోనే ఉంటుందని, ఇకపైనా విడదీయరాని భాగంగానే కొనసాగుతుందని భారత్‌ మార్చి 20వ తేదీ పునరుద్ఘాటించింది.

Red Sea: ‘హౌతీ’ల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా!!

చైనా స్పందన:

  • అరుణాచల్‌ భారత్‌దేనంటూ అమెరికా చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.
  • భారత్‌–చైనా సరిహద్దు వివాదంలో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేదని చైనా తెలిపింది.
  • అమెరికా ఇతర దేశాల మధ్య వివాదాలను రెచ్చగొడుతూ, వాటిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ వ్యాఖ్యానించారు.

#Tags