ANGRAU: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిప్లొమా కోర్సులకు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు జూలై 22న ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్స్ను జూలై 24 నుంచి 26వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
#Tags