Union Ministry of Ayush: రాష్ట్రంలో కేంద్ర ఆయుష్ బృందం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల పనితీరును కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.హెచ్ ధీరేంద్ర కుమార్, సెంట్రల్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ సభ్యురాలు డాక్టర్ స్వాతి జునేజా బృందం నవంబర్ 1న పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించింది.
విజయవాడ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యశాల, గుడివాడలోని జీఆర్ ప్రభుత్వ హోమియో కళాశాల అనుబంధ వైద్యశాల, కొలవెన్నులోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, అమరావతిలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలను సందర్శించి వివరాలు సేకరించింది.
చదవండి: Fake Advertisement: ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. నిరుద్యోగులకు సూచన..
వారి వెంట రీజినల్ ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్ మురళి కృష్ణ, ఆయుష్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్స్ జీ రంగనాథ్, కె.క్రాంతి తేజ పాల్గొన్నారు.
చదవండి: ABDM: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రధాన ఉద్దేశం?
#Tags