Results: యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసులకు ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన యూపీఎస్సీ–2023 మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడయ్యాయి.
మెయిన్స్ పరీక్షలను గత సెప్టెంబర్లో నిర్వహించడం తెలిసిందే. గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలను దాదాపు 13 లక్షల మంది రాశారు.
చదవండి: Doctor to Collector: డాక్టర్ నుంచి కలెక్టర్గా మారిన యువతి..
15 వేల మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో దాదాపు 2,500 మంది తాజాగా ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్టు సమాచారం. ఇంటర్వ్యూ తేదీలతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి మొత్తం 1,105 మందిని సివిల్ సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేయనుంది.
#Tags