Students Talent in APPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో గిరిజన విద్యార్థుల ప్రతిభ.. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు ఎంపిక..!

ఏపీపీఎస్‌సీ పరీక్షలో తమ సత్తా చాటిన గిరిజన విద్యార్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ఐటీడాఏ పీఓ, ఎడ్యుకేషన్‌ సొసైటీ కరస్పాండెంట్‌ తెలిపారు..

పాడేరు: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో ఇద్దరు గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని వేపగుంటలో 21వ సెంచరీ ఎడ్యుకేషన్‌ సంస్థ గిరిజన విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది.

Govt Junior College Students: పరీక్షలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ..

 

 

ఇక్కడ శిక్షణ పొందిన పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ దేవరాపల్లి గ్రామానికి చెందిన సీదరి శ్రీనివాస్‌, విశాఖ నగరంలో ఉంటున్న గుజ్జెలి కమల్‌ భార్గవ్‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో సత్తా చాటారు.

ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, 21వ సెంచరీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కరస్పాండెంట్‌ కె.ధరణి అభినందనలు తెలిపారు. కాగా,  వీరిద్దరూ ఇటీవల ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్: టాప్ 10 క్విజ్ ప్రశ్నలు

#Tags