AP Inter Exams: ఇంటర్‌ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య..!

ఏపీలో ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షల కేంద్రాలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను ఆర్‌ఐఓ వెల్లడించారు..

తిరుపతి: జిల్లావ్యాప్తంగా 87 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు 683 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. మ్యాథ్స్‌–1బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు పరీక్షలు చేపట్టగా 30,294 మంది విద్యార్థులకు గాను 29,611 మంది హాజరైనట్లు వివరించారు.

Job Mela Tomorrow: గాయత్రి డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్‌–2బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

#Tags