Intermediate Public Exams 2024: నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
కర్నూలు : ఇంటర్మీడియెట్ థీయరీ పరీక్షలు ముగియడంతో నేటి(సోమవారం)నుంచి మూల్యాంకనాన్ని మొదలుపెట్టనున్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్)కాలేజీలో ఏర్పాట్లు చేశారు. మొదటి రోజున ఇంగ్లిషు, తెలుగు, హిందీ, సంస్కృతం, గణితం, మైనర్ మీడియం సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం కానుంది. 22 నుంచి మిగిలిన సబ్జెక్టుల మూల్యాంకనం జరగనుంది. ఏప్రిల్ 4వ తేదీలోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలా బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మూల్యాంకనానికి మొత్తం 704 మంది అధ్యాపకులను ఎంపిక చేశారు.
#Tags