Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

నంద్యాల టౌన్‌: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా తెలిపారు. గురు వారం ఆమె మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో తమ సమీపంలోని స్టేజి నుంచి పరీక్ష కేంద్రం వరకు, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి తమకు సమీపంలోని స్టేజి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ప్రయాణ సమయంలో హాల్‌ టికెట్‌ తప్పక చూపించాలన్నారు. పరీక్ష జరిగే రోజుల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు.


 

#Tags