Andhra Pradesh: దివ్యాంగ విద్యార్థులకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల పంపిణీ

అనకాపల్లి టౌన్‌: దివ్యాంగుల డిజిటల్‌ విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల–విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దృష్టి, వినికిడిలోపం గల దివ్యాంగ విద్యార్థులకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు న‌వంబ‌ర్‌ 21న‌ డిజిటల్‌ ట్యాబ్‌లు అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఈవోతోపాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎ.రవిబాబు, డిప్యూటీ డీఈవో పి.అప్పారావు, సహిత విద్య సమన్వయకర్త శకుంతల పాల్గొన్నారు.

చదవండి: APPSC: ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల నియా­మకాలు, ప్రమోషన్లలో వారికి 4 శాతం రిజర్వేషన్

జిల్లాలో 24 మండలాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు రూ.50 లక్షలు విలువ చేసే 165 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

#Tags