Latest Scholarships News: లేటెస్ట్ స్కాలర్షిప్స్ న్యూస్
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలకు ఎంపికై న విద్యార్థులను వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ అభినందించారు. శనివారం ట్రిపుల్ఐటీలో పలు సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసి ఉపకారవేతనాలు ఇచ్చేందుకు అంగీకరించాయి.
యూనైటేడ్ వే ఆఫ్ హైదరాబాద్, బిటియాన్ ఫెలో షిప్, సీమాన్ స్కాలర్షిప్ కింద 39మంది విద్యార్థులు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రొత్సహించేందుకు సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ సహకారంతో ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. 2023–24 విద్యాసంవత్సరానికిగాను 39 మంది విద్యార్థులకు ప్రతియేట రూ. 40వేల చొప్పున ఫేరోషిప్ అందనుంది. ఎంపికై న విద్యార్థులను ట్రిపుల్ఐటీ అధ్యాపకులు అభినందించారు.
#Tags