Free Coaching for Group1, 2 Exams: గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ఉచిత శిక్షణ..ఎక్కడంటే
గ్రూపు 1,2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నెల 17న నిర్వహస్తున్న అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచిన మొదటి పది మందికి ఉచితంగా శిక్షణ ఇస్తామని నర్సీపట్నానికి చెందిన రిషీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం మురళీకృష్ణ మంగళవారం తెలిపారు.
జనరల్ స్టీడీస్ పేపరు 150 మార్కులకు అభ్యర్థులు రాయాల్సి ఉంటుందన్నారు. మిగిలిన అభ్యర్థులకు పీజులో పదిశాతం రాయితీ ఇస్తామని తెలిపారు.
అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 45 శాతం, ఓసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు తెచ్చుకుంటే వారికి కూడా ఫీజులో పదిశాతం రాయితీ ఉంటుందని తెలిపారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. పూర్తి వివరాలకు 8106450108, 866290416 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
#Tags