Summer Camp: విద్యార్థులకు ఈనెల 28 నుంచి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

వెసవిలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఈనెల 28 నుంచి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు..

కైలాస్‌నగర్‌: రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి మే 11వ తేదీ వరకు వివేకానంద బాల సంస్కార్‌ వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరె భూమన్న, కోరెడ్డి లెనిన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 4 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు యోగా, జ్ఞానం, కర్ణాటక సంగీతం, భగవద్గీత శ్లోకాలు, నైతిక విలువల కథలు, భజనలు, చేతిరాత, చిత్రలేఖనం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Inter Supplementary: వచ్చేనెలలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. తేదీ..!

ఆసక్తిగల విద్యార్థులు రూ.1000/- చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు సంజయ్‌నగర్‌ కాలనీలోని కేజీబీవీ పక్కన గల సమితి కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు అల్పాహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9490052842, 9032883582 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.  

Health Insurance Plan: వృద్ధులకు ఆరోగ్య ధీమా!

#Tags