Kakatiya University: పీజీ విద్యార్థులు 18వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలోని పీజీ కళాశాలల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్‌ విద్యార్థులు ఈనెల 18వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి జ్యోతి తెలిపారు. రూ. 250 అపరాధ రుసుముతో ఈనెల 20వ తేదీవరకు గడువు ఉందని తెలిపారు. ఎంఏ, ఎంకాం కోర్సుల విద్యార్థులు అన్నిపేపర్లకు (రెగ్యులర్‌) రూ. 520 పరీక్షఫీజు, బ్యాక్‌లాగ్‌ మూడుపేపర్లు ఆపై రూ. 420, బ్యాక్‌లాగ్‌ రెండు పేపర్ల వరకు రూ. 160, ఇంప్రూవ్‌మెంట్‌ ప్రతి పేపర్‌కు రూ. 190 పరీక్ష ఫీజు చెల్లించాల్సింటుందన్నారు. ఎమ్మె స్సీ కోర్సుల్లో అన్ని సబ్జెక్టులకు రూ. 620, మూ డుపేపర్లు ఆపై రూ. 520, రెండుపేపర్ల వరకు రూ.190, ఇంప్రూవ్‌మెంట్‌కు ప్రతి పేపర్‌కు రూ.190 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.

#Tags