Degree Admissions : డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

చిత్తూరు: జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్‌లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డా.జీవనజ్యోతి అన్నారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ప్రకారం అడ్మిషన్‌లు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయన్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు ఈ నెల 10వ తేదీలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెప్పారు. తమ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్‌సీ కోర్సులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు.

NEET UG Paper Leak 2024: నీట్‌ యూజీ 2024 పరీక్ష రద్దు చేయొద్దు .. సుప్రీం కోర్టులో విద్యార్ధుల పిటిషన్‌ దాఖలు

#Tags