JNTU: జేఎన్టీయూ జీవీ క్లాస్–2 ఈసీ కమిటీ ఏర్పాటు
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీకి క్లాస్–2 ఎగ్జిక్యూట్ కౌన్సిల్ (ఈసీ)ను ఉన్నత విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కమిటీలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఉమెన్స్) కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అరుందతి, ఐతం విద్యాసంస్థల ఇండ్రస్ట్రియల్ రిలేషన్స్ హెడ్ డాక్టర్ బి.రాజేష్, గరివిడి ఫేకర్ సీఈఓ ఎం. సూర్య సుబ్రహ్మణ్యశర్మ, శివాణి గ్రూప్ విద్యా సంస్థల డైరెక్టర్ డి.వెంకటరావు, సీతం విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు సభ్యులుగా ఉన్నారు.
#Tags