DLED Course: డీఎల్‌ఈడీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం. వీళ్లు అర్హులు

భద్రాచలం: భద్రాచలంలోని గిరిజన కళాశాలలో 2024–26 విద్యాసంవత్సరానికి గాను డీఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ తెలిపారు. మొత్తం 50 సీట్లకు గాను ఏజెన్సీ ప్రాంతీయులై ఉండి ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు.

AP TET 2024 Notification : ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష విధానాలు, ఎంపిక ఇలా..

భద్రాచలంతో పాటు ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు భద్రాచలంలోని కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సెప్టెంబర్‌ 25వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పీఓ తెలిపారు.
 

#Tags