NCERT: ఎన్సీఈఆర్టీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక
Sakshi Education
![Dr. M. Lakshminarasimha's New Role at NCERT, NCERT's Newest Addition, Selected as Assistant Professor in NCERT, Dr. M. Lakshminarasimha joins NCERT's Department of Educational Psychology,](/sites/default/files/images/2023/11/20/ncert-1700460345.jpg)
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం సైకాలజీ శాఖ అకడమిక్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం. లక్ష్మీనరసింహా ఢిల్లీలోని జాతీయ విద్యా, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికయ్యాడు. సైకాలజీ విభాగాధిపతి డా. కె. లలిత, సహ ఆచార్యులు డా. వి. లాజరస్ ఆధ్వర్యంలో డా. లక్ష్మీనరసింహా మర్యాదపూర్వకంగా వీసీ, రిజిస్ట్రార్లను కలిశారు. వారు ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు బి.రవి, అశ్వర్థరెడ్డి, టి. సురేష్బాబు పాల్గొన్నారు.
చదవండి: Free Coaching : ఉచిత సివిల్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి
Published date : 20 Nov 2023 11:35AM