Skip to main content

IT Organizations in AP: విశాఖ‌కు మ‌రిన్ని ఐటీ సంస్థ‌లు..

రుషికొండ‌లో సీఎం ప్రారంభించ‌నున్న ఇన్ఫోసిస్ కార్యాల‌యంలో మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ సంద‌ర్శించి ఐటీ సంస్థ‌ల ప్రారంభం గురించి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
AP Minister inspecting the arrangements
AP Minister inspecting the arrangements

సాక్షి ఎడ్యుకేష‌న్: భవిష్యత్‌లో విశాఖకు మరిన్ని ఐటీ సంస్థలు వచ్చే అవకాశం ఉందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రుషికొండలో గల ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ ఉత్పత్తుల్లో విశాఖను సముచిత స్థానం నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

National Board of Accreditation: పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల‌కు ఎన్‌బీఏ గుర్తింపు

ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుందని, మొదటి విడతలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ప్రారంభం కానుందని తెలిపారు. ఆయన వెంట మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఉన్నారు.
 

Published date : 16 Oct 2023 01:47PM

Photo Stories