యోగా స్పోర్గ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతపురంలో యోగా పోటీలను నిర్వహించనునట్లు ప్రకటనను విడుదల చేసారు. ఇచ్చిన గుడువులోగా వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
Yoga competitions held in Anantapur district
సాక్షి ఎడ్యుకేషన్: ఈ నెల 24న ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.రాజశేఖరరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో ఉన్న వివేకానంద భవన్లో జరిగే పోటీలకు 9 నుంచి 55 సంవత్సరాల వయసున్న వారు పాల్గొనవచ్చు.
వయసును బట్టి మొత్తం ఆరు విభాగాలుగా పోటీలను నిర్వహించనున్నారు. పోటీల్లో విజేతలకు నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఈఎన్ మారుతీప్రసాద్, శ్రీనివాసులు తెలిపారు.