ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లించేందుకు ఇచ్చిన గడువును కాస్త పొడిగించారని శుక్రవారం ప్రకటించారు. చల్లించాల్సిన ఫీజు, వాటి వివరాలను కూడా ప్రకటనలో తెలిపారు.
NMMS exam fees payment
సాక్షి ఎడ్యుకేషన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫీజు గడువును వచ్చే నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ గంగాభవాని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 3న పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష రుసుము జనరల్, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాల్సి ఉందని తెలిపారు. వివరాలను www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.