Open Tenth and Inter: శుక్రవారం ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి..
![Open tenth and intermediate exams went perfect on Friday](/sites/default/files/images/2024/06/08/open-tenth-inter-exams-1717839251.jpg)
నంద్యాల: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ సుధాకర్రెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కో-ఆర్డినేటర్ లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం జరిగిన శాస్త్రసాంకేతిక విజ్ఞానం, భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం పరీక్షలకు 923 మంది విద్యార్థులకు గానూ 848 మంది హాజరు కాగా 75 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పదవ తరగతి గణితశాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరీక్షకు 620 మంది విద్యార్థులకు గానూ 563 మంది విద్యార్థులు హాజరు కాగా 57 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం పరీక్షలకు 303 మంది విద్యార్థులకు గానూ 285 మంది విద్యార్థులు హాజరు కాగా 18 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ పరిశీలించారన్నారు.
Degree Students: సెమిస్టర్ పరీక్షలల్లో డీబారైన విద్యార్థులు..