Degree Students: సెమిస్టర్ పరీక్షలల్లో డీబారైన విద్యార్థులు..
Sakshi Education
![Degree students gets debar during semester exams](/sites/default/files/images/2024/06/08/degree-semester-debar-students-1717837810.jpg)
కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో 9 మంది డిబార్ అయ్యారు. పరీక్షలకు 6,522 మందికి 5,968 మంది (92 శాతం) విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. నందికొట్కూరు బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో 2, ఆలూరు శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాలలో 2, డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నందికొట్కూరు శ్రీసాయిరాం డిగ్రీ కళాశాల, శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాల, బేతంచర్ల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు.
Government Schools: సర్కారు బడుల్లో ప్రవేశాలకు విద్యార్థుల ఆసక్తి.. కారణం..?
Published date : 08 Jun 2024 02:40PM