Skip to main content

Half Day Schools Timings : ఒంటిపూట బడుల స‌మ‌యంలో మార్పులు.. ఇక‌నుంచి..

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. ఇక‌, ఎండ‌ల తీవ్రత కార‌ణంగా విద్యార్థుల‌కు ఒంటి పూట బ‌డులను ప్రారంభించారు.
Minor changes in half day schools timings

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. ఇక‌, ఎండ‌ల తీవ్రత కార‌ణంగా విద్యార్థుల‌కు ఒంటి పూట బ‌డులను ప్రారంభించారు. ఈమెర‌కు స‌మ‌యాన్ని కూడా ప్ర‌క‌టించ‌గా.. రెండు రోజుల త‌రువాత ఆ స‌మ‌యాల్లో స్వల్ప మార్పులు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు అధికారులు. ఇంత‌కు ముందు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో 1.15 గంట‌ల‌కు పాఠ‌శాల‌లు ప్రారంభం కాగా, విద్యార్థులు ప‌రీక్ష‌లు ముగిసి, ప‌రీక్ష ప‌త్రాలు పాఠ‌శాల‌ల బ‌య‌ట‌కు వెళ్లే వ‌ర‌కు త‌ర‌గతి విద్యార్థులు బ‌య‌టే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

JNTU BTech Results : జేఎన్‌టీయూ బీటెక్ సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఈసారి పాస్ ప‌ర్సెంట్ ఎంతంటే..!!

దీంతో, ఎండ‌ల్లోనే ఉండాల్సి వ‌స్తుంద‌ని అధికారులు ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇక‌నుంచి, ఒక 15 నిమిషాల‌ను పెంచుతూ.. 1.15 గంట‌ల‌ను కాస్త 1.30 చేశారు. అంటే, ఇక నుంచి విద్యార్థులు మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ఒంటిపూట బ‌డులు ప్రారంభ‌మై సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు న‌డుస్తాయి. ఇక‌, ఈ మార్పులు కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న పాఠ‌శాల‌ల్లో మాత్రమే. వ‌చ్చే నెల అంటే, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు ఈ ఒంటిపూట బడులు న‌డ‌వ‌నున్నాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Mar 2025 12:35PM

Photo Stories