Skip to main content

ISO Certificate : బాలిక‌ల గురుకులానికి ఐఎస్ఓ గుర్తింపు!

International Standard Organization certificate for girls gurukul school

శింగనమల: నార్పలలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు దక్కింది. సోమవారం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ చేతుల మీదుగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ సంగీతకుమారి ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌) సర్టిఫికెట్‌ను అందుకున్నారు.

Educational Epiphany : ‘ఎడ్యుకేషనల్‌ ఎపిఫని’ ప్రతిభా పరీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ త‌ర‌గ‌తుల‌కే..!

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ... దేశంలోనే మొదటిసారి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ అందుకున్న ప్రభుత్వ గురుకుల పాఠశాలగా గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన, పాఠశాల నిర్వహణకు సరైన గుర్తింపు దక్కిందన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Oct 2024 01:02PM

Photo Stories