ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జగిత్యాల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీ నర్ మారవేణి రంజిత్కుమార్ కోరారు.
డిగ్రీ కళాశాల హామీ నెరవేర్చాలి
ఎల్లారెడ్డిపేటలో ఏప్రిల్ 10న మాట్లాడుతూ.. స్థానికంగా డిగ్రీ కళాశాల లేక నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. ఏటా 1,500 మంది ఇంటర్ ఉత్తీర్ణులు అవుతున్నప్పటికీ సగంకూడా ఉన్నత విద్యకు నోచుకోలేకపోతున్నారన్నారు. కళాశాల కో సం అనేకసార్లు విద్యార్థులతో కలిసి పోరాటాలు చే స్తే మంత్రి కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నా రు. సోమవారం మండల పర్యటనకు వస్తున్న మంత్రి డిగ్రీ కాలేజీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.