Skip to main content

New Fisheries Technology: మ‌త్స్య‌కారుల‌తో సంప్ర‌దింపులు.. కార‌ణం?

వ్యాపారాన్ని మెరుగుప‌రిచేందుకు నిర్వ‌హిస్తున్న అధ్య‌య‌నానికి మ‌త్స్య‌కారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఈ నేప‌థ్యంలో ప‌లు జిల్లాల నుంచి పారిశ్రామిక‌వేత్త‌లు పాల్గొన్నారు.
District-wide Business Improvement Consultation,  Entrepreneurs consulting fisherman's for new technologies, Economic Development Discussion with Fishermen
Entrepreneurs consulting fisherman's for new technologies

సాక్షి ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ తమిళనాడులో చేపల వనరులకు సంబంధించిన వ్యాపార అవకాశాలను మెరుగుపరచడానికి ఐదు క్షేత్ర అధ్యయనాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చైన్నె హార్బర్‌ ప్రాంతంలో మత్స్యకారులతో మంగళవారం సంప్రదింపులు నిర్వహించింది. ఇందులో చైన్నె, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాలకు చెందిన మత్స్యకారుల సహకార నిధులు, మత్స్య సంబంధిత పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

➤   Literature Competitions: విద్యార్థుల‌కు సాహిత్య పోటీలు

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకురాలు డాక్టర్‌ గీతా, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ షణ్ముకానందం కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సదుపాయాలపై వివరించారు. ఈ ప్రాంతంలోని రొయ్యల ఫారం నుంచి వెలువడే వ్యర్థ జలాల కాలుష్యాన్ని తగ్గించడానికి సంబందించిన సాంకేతికతను తెలియజేయడానికి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. చెంగల్పట్టు ప్రాంతంలో లోతట్టు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పారిశ్రామిక, వాణిజ్య అంశాలపై చర్చించారు.

➤   NAAS Exams for Students: విద్యార్థుల‌కు నాస్ ప‌రీక్ష‌లు

చైన్నెలోని హార్బర్‌ ప్రాంతంలో సెంట్రల్‌ ఫిషరీష్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ శాఖను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా మత్స్యకార సంబంధిత సాంకేతిక శిక్షణను ఈ ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాల యువతకు సులభంగా అందుబాటులో ఉంచాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో చైన్నె పోర్ట్‌ సభ్యుడు సతీష్‌ సీమ జాగరణ్‌ మాన్సిన్‌, ఉత్తర తమిళనాడు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎన్‌ ఆర్‌ ఎస్‌ లేష్మన్‌ అధ్యక్షత వహించారు. ఇందులో సత్యమూర్తి, రామ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Published date : 26 Oct 2023 12:15PM

Photo Stories