Grama-Ward Secretariat 2023: పలు సమస్యలపై వినతి పత్రం
Sakshi Education
మహారాణిపేట: తమపై ఎలాంటి అదనపు భారం పెట్టవద్దని గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పీజే గణేష్ కుమార్కుమార్, భార్గవ్ కోరారు. మంగళవారం మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
మేయర్ హరి వెంకట కుమారికి వినతి పత్రం అందజేస్తున్న గణేష్ కుమార్
వార్డు అడ్మిన్ల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని కూలంకుశంగా పరిశీలించి, త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని మేయర్ హమీ ఇచ్చినట్టు గణేష్ కుమార్ తెలిపారు. అన్ని పనులకు అడ్మిన్ సెక్రటరీలను బాధ్యులను చేయడం తగదన్నారు. మిగతా సెక్రటరీలకు నిర్దేశించిన పనులు అప్పగించి, అన్ని బాధ్యతలను అడ్మిన్ సెక్రటరీలకు అప్పగించడం అన్యాయమన్నారు.