Skip to main content

Earth Foundation: కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు

దుబ్బాకరూరల్‌: మండలంలోని తిమ్మాపూర్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎర్త్‌ పౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ క్రీడాసామగ్రి, స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ చేశాసింది.
you study hard you will reach higher heights

ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి హాజరై విద్యార్థులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు.

చదవండి: Jobs in India: వ‌చ్చే మూడు నెల‌ల్లో ఎక్కువ నియామకాలు.. 37 శాతం కంపెనీలు సానుకూలం..

అనంతరం అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని తాళ్లపల్లి, పోతారరెడ్డిపేట, ఎనగుర్తి, దుబ్బాక మండలంలోని రఘోత్తంపల్లి, శిలాజినగర్‌, గోసాన్‌పల్లి, టేకులతాండ, అచ్చుమాయిపల్లి, హబ్సిపూర్‌ గ్రామా ల్లోని పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభుదాస్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 15 Dec 2023 11:49AM

Photo Stories