Skip to main content

Breaking News: లీకేజీతో పాటు... ఆన్స‌ర్ షీట్లుకూడా మిస్‌.. తెలంగాణ‌లో షాకింగ్ ఘ‌ట‌న‌లు.!

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదో తరగతి ఆన్సర్‌షీట్‌ల కట్ట మిస్‌ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.
TS 10th Exams
TS 10th Exams

పోస్టల్‌ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా? అనే తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు అవి ఏ సెంటర్‌ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

చ‌ద‌వండి: మ‌రో పేప‌ర్ లీక్‌... ప‌రీక్ష స‌మయానికి ముందే వాట్స‌ప్‌లో చ‌క్క‌ర్లు
11కి బ‌దులు ప‌దే... 

ఉట్నూరులో పరీక్ష రాసేందుకు 1,011 మంది విద్యార్థులకు అయిదు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జవాబుపత్రాలను ఆయా కేంద్రాల బాధ్యులు తపాలా కార్యాలయంలో అప్పజెప్పారు. అక్కడి సిబ్బంది పత్రాలన్నింటినీ 11 కట్టలుగా విభజించి మూల్యాంకన కేంద్రాలకు తరలించేందుకు బస్టాండ్‌కు ఓ ఆటోలో తీసుకొచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి కట్టలను లెక్కించారు. 11 బదులు పది కట్టలే ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. జవాబు పత్రాల కట్ట కోసం ప్రధాన రహదారితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు. అది దొరక్కపోవడంతో తపాలా కార్యాలయ సబ్‌ పోస్టుమాస్టర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. భ‌ర‌త్‌ వెల్లడించారు. పేప‌ర్ లీకేజీల‌తో పాటు జ‌వాబు ప‌త్రాలు కూడా మాయ‌మ‌వ‌డంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

చ‌ద‌వండి: ఉద్దేశ‌పూర్వ‌కంగానే పేప‌ర్ లీక్.. ఐదుగురిపై స‌స్పెన్ష‌న్‌ వేటు ​​​​​​​

Published date : 04 Apr 2023 04:07PM

Photo Stories