Skip to main content

Telangana: విద్యారంగ సమస్యలు పరిష్కరించండి

నారాయణఖేడ్‌ : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఉమ్మడి మెదక్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ‌నవ‌రి 12న‌ ఖేడ్‌ ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
students seeking resolution for educational challenges.  Solve educational problems   Students submitting a petition at Khed RDO office.

 ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ తెంకటి కుమార్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు, వసతిగృహాల మెస్‌, కాస్మోటిక్‌ చార్జీల బకాయిలను వెంటనే చెల్లించాలని, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.

చదవండి: Clean Survey 2023: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు..!

విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తూ జాబ్‌క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు పవన్‌, అనిల్‌, మహిపాల్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Published date : 13 Jan 2024 04:07PM

Photo Stories