Skip to main content

Govt Schols: ప్రభుత్వ స్కూళ్లకు రక్షణ కరువు

గొల్లపల్లి: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేక రక్షణ కరువైంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 511 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 187 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
Zilla Parishad high school in need of security    Improving safety in primary education institutions  Protection drought for government schools   Government primary school lacking security

 వీటిలో మన ఊరు – మనబడి కింద 258 పాఠశాలలకు ప్రహరీగోడలు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని ప్రగతి దశలో ఉన్నాయి. 223 పీఎస్‌, యూపీఎస్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలకు పూర్తి స్థాయిలో ప్రహరీలు లేవు. మిగిలిన పాఠశాలల్లో పాతగోడలు, మరి కొన్నిచోట్ల ఒకవైపు కొంతమేర నిర్మాణాలు చేపట్టి మిగితా వైపు అసంపూర్తిగా వదిలేశారు.

ప్రహరీలు లేకపోవడంతో ఆవరణలోకే ఆవులు, గేదెలు, పందులు వస్తున్నాయి. ఇతర మూగజీవాలు పాఠశాలల్లోకి ప్రవేశించి పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉదయం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు వచ్చి చూస్తే పేడకుప్పలు, చెత్తాచెదారం కనిపిస్తోంది.

చదవండి: Science Lab: పాఠశాలలో మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన కలెక్టర్‌..

ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా మారుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులే తొలగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్కూళ్ల ఆవరణలో హరితహారం కింద నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. మరికొన్ని పాఠశాలలు రాత్రివేళ మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని ఉపాధ్యాయులు, ప్రజలు అంటున్నారు.

Published date : 12 Jan 2024 10:51AM

Photo Stories